KKD: రాజానగరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు తయారు చేయాలని MLA బత్తుల బలరామకృష్ణ ఆదేశించారు. గురువారం రాజానగరంలో పంచాయతీరాజ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో MLA సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.