KDP: మధ్యాహ్న భోజన పథకాన్ని ఎగతాళి చేస్తూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై RSF రాష్ట్ర అధ్యక్షుడు DM ఓబులేసు యాదవ్ ఇవాళ తీవ్రంగా ఖండించారు. గరికపాటి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని, ఆయన పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదల ఆకలిని, విద్యార్థుల ఆత్మగౌరవాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.