E.G: ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ పటంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని నిడదవోలు MLA, మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం విశాఖపట్నంలో ‘హయత్’ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సీఐఐ సమ్మిట్ ఫలితంగా కుదిరిన ఎంవోయూలు నేడు కార్యరూపం దాల్చుతున్నాయని తెలిపారు.