NLG: నాగార్జునసాగర్ ఆయకట్టు మండలాల్లో ప్రస్తుతం వరి కోతలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశుగ్రాసం కోసం వరిగడ్డి కట్టలు కట్టే యంత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ట్రాక్టర్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఈ యంత్రాన్ని బిగించి, కోత మిషన్లు కోసిన వరిగడ్డిని కట్టలుగా తయారు చేస్తున్నారు. అందరూ ఒకే సారి అవసరం రావడంతో ఈ యంత్రాలకు డిమాండ్ పెరిగింది.