VZM: గుర్ల మండలం జమ్మూపేట గ్రామంలో శనివారం శ్రీ మహాగణపతి, షిర్డీసాయి, హనుమత్, లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.