BHPL: కాటారం మండల కేంద్రంలోని అటవీ రేంజ్ కాంప్లెక్స్లో శనివారం ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా అటవీ క్షేత్రాధికారి జె. స్వాతి ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటింటా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని రక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. డిప్యూటీ రేంజర్లు సురేందర్, శ్రీనివాస్, బీట్ అధికారులు ఉన్నారు.