TPT: సూళ్లూరుపేట మండలం మన్నేముత్తేరిలో చోరీ జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ పాస్టర్ కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించారు. విలువైన వస్తువులు కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.