కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి గురువారం నిడమర్రు మండలం, పెద్దనిండ్రకొలను వాస్తవ్యులు చిటికిరెడ్డి అప్పారావు, లక్ష్మి కుటుంబ సభ్యులు రూ. 50,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామి చిత్రపటం అందజేశారు.