E.G: కొవ్వూరులోని టీడీపీ కార్యాలయంలో MLA ముప్పిడి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ప్రజలు డ్రైనేజీ, త్రాగునీరు, పింఛన్లు, రోడ్లు, తదితర సమస్యలు తెలుపుతూ 25 వినతి పత్రాలను అందించారు. పలు సమస్యల తక్షణ పరిష్కారం కొరకు సంబందిత అధికారులతో MLA ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.