ప్రకాశం: ఉలవపాడు మండలంలోని రాజుపాలెం సమీపంలో మంగళవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని చిరు వ్యాపారికి తీవ్ర గాయాలయ్యాయి. మద్దిపాడు మండలానికి చెందిన శేషయ్య మామిడి పండ్లు గంపని ఎత్తుకుని రోడ్డు దాటుతున్న సమయంలో బస్సు ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా శేషయ్య అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.