అన్నమయ్య: రాజంపేటలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంపై అధికారులు, బాధితులతో కీలక సమావేశం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ.. అభివృద్ధితో పాటు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయే వారికి నష్టపరిహారం అందించడంతో పాటు దుకాణదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.