ELR: జనాభా గణన 2027 కార్యక్రమంలో ఇంటి జాబితా, గృహ గణనపై అవగాహన కల్పించే పత్రికను ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు ఆవిష్కరించారు. స్థానిక MLA క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం జనాభా గణన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు పూర్తి సమాచారం అందించాలన్నారు.