ప్రకాశం: అమరావతి రాజధానికి చట్టబద్ధత పేరుతో సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆరోపించారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిపై చర్చ తప్పించేందుకే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. అమరావతికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, దోపిడీని మాత్రమే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు.