కడప: ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన CM చంద్రబాబు తన పర్యటనను ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రామయ్య కళ్యాణం ముగిసిన అనంతరం ఒంటిమిట్టలో ఆయన రాత్రి బస చేశారు. నేడు ఉదయం ఒంటిమిట్టలోని హెలిపాడ్ వద్ద నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లారు. ఆయనకు కలెక్టర్ శ్రీధర్, DIG కోయ ప్రవీణ్ వీడ్కోలు పలికారు.