ELR: గణపవరం వెలంపేటలో వేంచేసి యున్న శ్రీ గోధా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికి సన్మానించారు.