ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వేచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్సై సందీప్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి ఒంగోలు బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయ వద్దన్నారు.