MLG: వెంకటాపురం మండలం పాత్రపురం మంగళవారం వ్యవసాయ అధికారులు ఫర్టిలైజర్ డీలర్లతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల నిల్వలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, స్టాక్, విక్రయాల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.