PPM: వైసీపీ మహిళా పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కురుపాం నియోజకవర్గ నేతలు చినమేరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమినేతలకు మహిళల పట్ల ఎలాంటి గౌరవం ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తుందన్నారు.