KDP: సింహాద్రిపురం నూతన తహసీల్దార్గా బి. అనురాధ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె డీఎం సివిల్ సప్లై విభాగంలో విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై తాజా బదిలీలలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.