KRNL: మంగళవారం ఎమ్మిగనూరు-మంత్రాలయం జాతీయ రహదారిపై కల్లుదేవకుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక జింక మృతి చెందింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందిన అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి, ఖననం చేస్తామని FBO నాగేష్ తెలిపారు.