NLR: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల,నగరంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ, ఈవీఎంలు భద్రపరిచిన మూడు గోడౌన్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.