విశాఖపట్నం-బ్రహ్మపూర్ ప్యాసింజర్ రైలు (58532) మంగళవారం రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. లింక్ రైలు ఆలస్యంగా రావడం వల్ల, సాయంత్రం 5:45 గంటలకు బదులుగా 6:45 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించి తమ ప్రయాణాలను సర్దుబాటు చేసుకోవాలని కోరారు.