ELR: జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేసే కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పాలసీ కొండంత అండగా నిలుస్తుందని డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం బయ్యనగూడెంలో నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.లక్ష బీమా వర్తిస్తుందని తెలిపారు.