ATP: యాడికి పర్యటనకు విచ్చేసిన CM చంద్రబాబు నాయుడుకు జేసీ కుటుంబం ఘన స్వాగతం పలికింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి కలిసి సీఎంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ “ఎలా ఉన్నావు?” అని కుశలప్రశ్నలు వేశారు.