CTR: శాంతిపురం మండలం టి. కొత్తూరు గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీఐ శ్రీ మల్లేష్ యాదవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రహదారి భద్రతా నియమాలు, మహిళల భద్రత, నేరాలు, మత్తుపదార్థాల దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ నైతిక విలువలు కలిగి ఉండాలని సీఐ వివరించారు.