SKLM: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన భారతీయ హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ అని తెలిపారు. 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.