KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర కలిసి ఆవిష్కరించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణాన్ని రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.