KDP: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ్టి కార్యక్రమాలను అధికారులు వెల్లడించారు. ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9:30 గంటల వరకు వటపత్రశాయి అలంకారం, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్వపన తిరుమంజసం, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహ వాహనం చేపట్టనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.