BPT: అద్దంకి సీఐ సుబ్బరాజు యువతకు క్రికెట్ బెట్టింగ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ పెంచాలని అన్నారు. బెట్టింగ్లలో పాల్గొంటే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.