CTR: పూతలపట్టు నియోజకవర్గంలో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.19.27 కోట్లు జమ చేయనున్నట్లు ఏవో మధురవాణి తెలిపారు. ఈ పథకం ద్వారా 33,881 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మండలాల వారీగా ఐరాలకు రూ.3.62 కోట్లు, యాదమరికి రూ.3.37 కోట్లు, బంగారుపాళ్యానికి రూ.5.14 కోట్లు, పూతలపట్టుకు రూ.3.46 కోట్లు, తవణంపల్లెకు రూ.3.67 కోట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.