KRNL: కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో అక్రమ ఇసుక రవాణాపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇవాళ గ్రామం మీదుగా ఇసుక ట్రిప్పర్లు వెళ్లవద్దని కోరిన తిక్కారెడ్డి వర్గం, రాఘవేంద్ర రెడ్డి వర్గంతో వాగ్వాదానికి దిగింది. వివాదం తీవ్రరూపం దాల్చి కళ్లలో కారం చల్లి, మారణాయుధాలతో దాడులు చేసుకోవడంతో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఘటనపై కౌంటర్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.