E.G: రాజానగరం మండలం నరేంద్రపురం యూనిట్లో శనివారం రైతుల కోసం PMDS (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) కిట్ల తయారీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు పంపిణీ చేయడానికి ఒక్కో కిట్లో 15 కిలోల చొప్పున మొత్తం 26 రకాల విత్తనాలతో 250 కిట్లు సిద్ధం చేశారు. ఈ కిట్లు PMDS పద్ధతిలో ఉపయోగపడేలా రూపొందించామని ప్రకృతి వ్యవసాయ అధికారి నీతు గ్రేస్ తెలిపారు.