NDL: కొలిమిగుండ్ల మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నిమ్మకాయల రంగయ్య తన అనుచరులతో కలిసి ఇవాళ బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీ నాయకులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు.