ATP: తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. పట్టణ అభివృద్ధి కోసం గత ఐదేళ్లుగా అందరూ కలిసి పనిచేశామని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఎవరైనా సరే అభివృద్ధిని చూసే ఓటేయాలని ప్రజలను కోరాలని సూచించారు. పట్టణ ప్రగతి కోసం కృషి చేసే వారికే ప్రజలు మద్దతు ఇస్తారని పేర్కొన్నారు.