NLR: మాజీ ఉపప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆయన చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యానికి, దళితుల హక్కుల కోసం జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.