TPT: శ్రీకాళహస్తి గుడిలోని కళారాధన వేదిక వద్ద శ్రీ ఆది శంకరాచార్యుల జయంతిని నిర్వహించారు. ఈవో వెంకటేశులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విశేష పూజలు చేశారు. ఆది శంకరాచార్యులు తన శాంతియుత వేదాంత సందేశంతో ప్రజలకు అనేక బోధనలు చేయడం జరిగిందని ఈవో పేర్కొన్నారు. ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని విస్తరింప చేశారని వెల్లడించారు.