ATP: ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు. సంస్థ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, విషాల్ ఫెర్రర్లను కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యా, ఆర్థికాభివృద్ధికి ఆర్డీటీ చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు.