TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముస్లింపాలెంలో పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న టీడీపీ నేత బాలసుందరంను పరామర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.