SKLM: జిల్లాలో మత్స్య సంపద పునరుత్పత్తిని కాపాడేందుకు సముద్రంలో చేపల వేటపై ఇవాళ అర్ధరాత్రి నుంచి నిషేధం అమల్లోకి రానుంది. జూన్ 16 వరకు కొనసాగే ఈ నిషేధ కాలంలో వేట సాగిస్తే చేపల గుడ్లు, ఉత్పత్తులు నశించిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు ఈ 61 రోజుల పాటు వేటకు దూరంగా ఉండి సహకరించాలని మత్స్యశాఖ అధికారులు కోరారు.