ATP: జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం ఎస్పీ జగదీష్తో కలిసి నిర్వహించిన ఎన్సీఓఆర్డీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి సాగు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.