NLR: మర్రిపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి విద్యార్థినులకు మండల సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిబ్బంది విద్యా సామగ్రి అందించారు. రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి విద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.