E.G: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులైన ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కేసు నుంచి తమను తప్పించాలని రాజమండ్రి కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉభయ పక్షాల వాదనలు విన్న రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది.