SKLM: నరసన్నపేటలోని గుండవల్లిపేట సమీపంలో ఉన్న చెరువులో గ్రామాల్లో సేకరించిన చెత్తను డంప్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుండవల్లిపేట, రావుల వలస గ్రామాల నుంచి సేకరించిన చెత్తను చెరువులో వేయడంతో నీరు కలుషితం అవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెరువులో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.