నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్ స్థానిక వీఆర్ మున్సిపల్ పాఠశాలను శనివారం సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా మేయర్, కమిషనర్లు తిని ఆహార నాణ్యతను పరీక్షించారు. అనంతరం మేయర్ చిన్నారులకు భోజనం తినిపించారు.