NDL: బనగానపల్లెలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని సోమవారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరస్పరంగా పార్టీ బలోపేతం, అభివృద్ధి అంశాలపై చర్చించారు.