ప్రకాశం: బేస్తవారిపేటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఇవాళ అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో కొనసాగింది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు కోరుకున్నారు.