అన్నమయ్య: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించకూడదని అన్నమయ్య జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ షేక్ జాబీర్, ప్రధాన కార్యదర్శి గఫార్ ఖాన్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దశలవారీ పోరాటంలో భాగంగా రాయచోటి బాలికోన్నత పాఠశాల పదవ తరగతి మూల్యాంకన కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.