ATP: నార్పల మండలం నడింపల్లిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ‘బనానా వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్’ను ప్రారంభించారు. అరటి వ్యర్థాల నుంచి ఉప ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా డ్వాక్రా మహిళలు, యువతకు స్వయం ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. పీ4, సీఎస్ఆర్ కింద సుజలన్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.