NLR: రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘గుడ్ సమారిటన్’ పథకంతో పాటు పీఎం రాహత్ పథకం అమలు అవుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్సు తెలిపారు. కలెక్టర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఎం రాహత్ భరోసా పోస్టర్లను ఆవిష్కరించారు. పథకం ద్వారా గాయపడిన వారికి రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తామన్నారు.