BPT: గుండె సమస్యతో బాధపడుతున్న ఇంకొల్లు మండలానికి చెందిన శిశువు చికిత్స కోసం మంగళవారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భారీ సాయం అందించారు. సొంత నిధుల నుంచి రూ. 50 వేలు ఇవ్వడంతోపాటు, సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 3.02 లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సహకారంతో గుంటూరులోని ఆసుపత్రిలో చిన్నారికి అత్యవసర చికిత్స కొనసాగుతోంది.